AP EAMCET ONLINE MOCK TEST 2020
ఏపీ ఎంసెట్ పరీక్షలో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆన్లైన్లో ఉచిత ఎంసెట్ మాక్ టెస్ట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ గారు తెలిపారు. ఈ మేరకు సోమవారం మాక్ టెస్ట్ వివరాలకు సంబంధించిన పోస్టర్ను కూడా ఆయన ఆవిష్కరించారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ జులై 19న మాక్ టెస్ట్ను నిర్వహిస్తుందని తెలిపారు.
ఎంసెట్ మాదిరిగానే ఈ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారన్నారు.
మరుసటి రోజున జులై 20న ఫలితాలు వెల్లడిస్తారన్నారు.
ఫలితాలతో పాటు విద్యార్థులు ఏ ఏ అంశాలలో ఎక్కువ కృషి చేయాలో తెలుపుతారన్నారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఎంసెట్ మాక్ పరీక్షలో పాల్గొనదలచిన విద్యార్ధులు
www.csihyderabad.org/eamcet లేదా www.eamcet.xplore.co.in లలో ఈ నెల 18వ తారీఖు లోగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
1 Comments
At mentioned page doesn't working
ReplyDelete